
ఇంతవరకూ సున్నితమైన ప్రేమకథాంశాలకు దర్శకత్వం వహించిన శేఖర్ కమ్ముల తొలిసారి రాజకీయ నేపథ్యంలో 'లీడర్' చిత్రాన్ని తెరకెక్కిస్తు న్నారు. రాణా సరసన ప్రియా ఆనంద్, రిచా హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవంబర్ 1న లోగో ఆవిష్కరణ జరిపి, 15వ తేదీన ఏర్పాటు చేసే ఓ భారీ కార్యక్రమంలో రాణాను తొలిసారి ప్రేక్షకులు, మీడియాకు పరిచయం చేయాలని నిర్మాతల ఆలోచనగా తెలుస్తోంది. మిక్కీ జె.మేయర్ సంగీతం అందించిన ఆడియో నవంబర్ 24న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. క్రిస్మస్, సంక్రాంతి పండుగలు కలసొచ్చేలా డిసెంబర్ 24న 'లీడర్' ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
No comments:
Post a Comment