
అరుణ్ కుమార్ దర్శకత్వంలో 'యాగం', 'మా నాన్న చిరంజీవి' చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందాల నటి భూమిక, నవదీప్ జంటగా 'యాగం' తెరకెక్కింది. బాలీవుడ్ సెక్సీ బ్యూటీ కిమ్ శర్మ మరో కథానాయిక. జగపతిబాబు కథానాయకుడుగా 'మా నాన్న చిరంజీవి' (అంటే ఓ పెద్ద హీరో) చిత్రం తెరకెక్కింది. త్వరలోనే ఈ రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. తాజాగా ఆయన 'ఎలెవెన్' అనే ఆలోచింపజేసే టైటిల్ తో మరో కొత్త చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రానికి ఆయన ప్లాన్ చేస్తున్నారు. నవదీప్, శ్రీరామ్ ఇందులో హీరోలుగా నటించనున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.
No comments:
Post a Comment