వరుణ్ 'కుర్రాడు' 5న

పలు విజయవంతమైన చిత్రాలను అందించిన ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పి.కిరణ్ నిర్మిస్తున్న తాజా చిత్రం 'కుర్రాడు'. వరుణ్ సందేశ్, నేహాశర్మ ('చిరుత' ఫేమ్) జంటగా నటించారు. సందీప్ గుణ్ణం దర్శకుడు. తమిళంలో ధనుష్ కథానాయకుడు విజయవంతమైన 'పొల్లాదవన్' చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రాన్ని నవంబర్ 5న విడుదల చేస్తున్నట్టు నిర్మాత కిరణ్ తెలిపారు.

'హ్యాపీడేస్', 'కొత్త బంగారులోకం' వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న చిత్రమిదనీ, నేహాశర్మ హీరోయిన్ గా నటించిందనీ ఆయన తెలిపారు. ఈ కథకు 'కుర్రాడు' అనే టైటిల్ హండ్రెడ్ పర్సంట్ యాప్ట్ అవుతుందన్నారు. ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడుగా పరిచయం అవుతున్న అచ్చు పాటలన్నీ చాలా అద్భుతంగా చేశారనీ, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నవంబర్ 5న సినిమా రిలీజ్ చేస్తున్నామనీ చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో 'బొమ్మాలి' రవి, తనికెళ్ల భరణి, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, వేణు, నవీన్ తదితరులు నటిస్తున్నారు. అనంత్ శ్రీరామ్ పాటలు, సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ, రాంబో రాజ్ కుమార్ ఫైట్స్, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ అందించారు

No comments:

Post a Comment