
పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ, సినిమా ప్రారంభం రోజునే మంచి ఓపినింగ్స్ తో పది వారాల టాక్ వచ్చిందని చెప్పారు. సాయిరాం శంకర్ గత సినిమాలతో పోల్చుకుంటే ఇందులో నటన, డాన్స్ లలో మంచి పరిణితి కనిపించిందనీ, రఘ కుంచె సంగీతం సినిమాకి ప్లస్ అయిందనీ అన్నారు. అలాగే ఆలీ-వేణుమాధవ్ లపై చేసిన 'మగధీర' కామెడీ ట్రాక్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు. తొలి సినిమా అయినా దర్శకుడు చాలా బాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని అన్నారు. సాయిరాం శంకర్ మాట్లాడుతూ, గతంలో తాను నటించిన రెండు చిత్రాలు పెద్దగా ఆడకపోయినప్పటికీ ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారనీ, వారందరికీ తన కృతజ్ఞతలనీ అన్నారు. దర్శకుడిగా తనకు ఇంత మంచి అవకాశమిచ్చిన పూరీ జగన్నాథ్ కు తన కృతజ్ఞతలని జయరవీంద్ర పేర్కొన్నారు. రఘ కుంచె మాట్లాడుతూ, ఈ చిత్రం తన కెరీర్ కు ఓ బంపర్ ఆఫర్ అనీ, ఇందులోని 'రవణమ్మా..' పాటకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోందనీ, అలాగే పూరీ జగన్నాథ్ పేరు ఈ చిత్రానికి ప్లస్ అయిందనీ అన్నారు. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
No comments:
Post a Comment