తనకోనెలో గద్దె

ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ -2005 కిరీటాన్ని దక్కించుకున్న విజయవాడ అమ్మాయి గద్దె సింధూర ఆమధ్యన రసూల్ దర్శకత్వంలో వచ్చిన 'సంగమం' చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తాజాగా గద్దె సింధూర ప్రధాన పాత్రధారిగా ఓ థ్రిల్లర్ చిత్రం తెరకెక్కనుంది. శ్రీనివాస క్రియేషన్స్ పతాకంపై నూతన నిర్మాత కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నగేష్ నారదాసి ('శ్రీ సత్యనారాయణ స్వమి' ఫేమ్) దర్శకుడు. తలకోనలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకొంటోంది. తొలిసారి ఆ చిత్ర విశేషాలను దర్శకనిర్మాతలు తెలియజేశారు.

గద్దె సింధూర ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కిస్తున్నామనీ, కథ-కథనం ఈ చిత్రానికి ప్రధాన బలమని కిరణ్ తెలిపారు. నగేష్ నారదాసి మాట్లాడుతూ, అక్టోబర్ 19న తలకోనలో షూటింగ్ ప్రారంభించామనీ, ఈనెల 5వ తేదీ వరకూ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు తీస్తున్నామనీ చెప్పారు. రెండో షెడ్యూల్ తిరుపతి, హైదరాబాద్ పరిసరాల్లో తీస్తామని చెప్పారు. ఇది పూర్తి స్థాయి సస్పెన్స్, థ్రిల్లర్ అనీ, హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రమనీ తెలిపారు. గద్దె సింధూర అద్భుతమైన పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో జీవా, తనికెళ్ల భరణి, రవిప్రకాష్, పొన్నాంబలం, రామిరెడ్డి, సుమన్ శెట్టి, నిళల్ గళ్ రవి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మధు ఎ.నాయుడు సినిమాటోగ్రఫీ, నందు ఫైట్స్, ప్రదీప్ ఆంటోని కొరియోగ్రఫీ, సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.

No comments:

Post a Comment