ఆర్య-2' ఆడియో రిలీజ్

అల్లు అర్జున్, కాజల్ హీరోహీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో భోగవల్లి ప్రసాద్, ఆదిత్య బాబు సంయుక్తంగా నిర్మించిన 'ఆర్య 2' ఆడియో విడుదల కార్యక్రమం హైద్రాబాద్ లో ఆదివారంనాడు పరిశ్రమ కన్నులపండువగా జరిగింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఆడియో సీడీని నాగబాబు, ప్రభాస్ సంయుక్తంగా విడుదల చేశారు. దిల్ రాజు, మాగంటి బాబు, శ్రీనువైట్ల, వరుణ్ సందేష్, ఆర్యన్ రాజేష్, మెహర్ రమేష్ లాంఛనంగా ఒక్కో పాటను రిలీజ్ చేశారు. ఎస్.ఎస్.రాజమౌళి, వి.వి.వినాయక్, క్రిష్, గుణ్ణం గంగరాజు, జెమినీ కిరణ్, అల్లు అర్జున్, నవదీప్, కాజల్, శ్రద్ధాదాస్, సుకుమార్, బివిఎస్ఎన్ ప్రసాద్, ఆదిత్య బాబు, రామ్-లక్ష్మణ్, సినిమాటోగ్రాఫర్ రాజశేఖర్, పలువురు చిత్ర సాంకేతిక నిపుణులు వేడుకలో పాల్గొన్నారు.

వి.వి.వినాయక్ మట్లాడుతూ, దర్శకుడు సుకుమార్ రెండేళ్ల పాటు గ్యాప్ ఎందుకు తీసుకున్నారని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడతారనీ, ఆయన మిస్టర్ పెర్ ఫెక్ట్ కావడమే ఇందుకు కారణమనీ అన్నారు. ఫిల్మ్ మేకింగ్ విషయంలో ఎక్కడా రాజీపడేది లేదని ఆయన ఈ చిత్రంతో చాటుకున్నారని అన్నారు. ఈ చిత్రంలో బన్నీ లుక్ చాలా బాగుందనీ, సినిమా సూపర్ హిట్ అయి సుకుమార్ కూ, నిర్మాతలకూ మంచి పేరు, లాభాలు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాననీ అన్నారు. సుకుమార్ మంచి దర్శకుడనీ, బన్నీ ఈ చిత్రం పోస్టర్ల మీద ఎలా ఎగురుతూ కనబడుతున్నాడో అలాగే ఈ ఏడాదంతా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ ఎగురుతూనే ఉంటాడనీ రాజమౌళి అన్నారు. దేవీశ్రీ అందించిన పాటల్లో 'రింగ రింగ' పాట ఈ సంవత్సరానికి పెద్ద హిట్ అవుతుందన్నారు. నాగబాబు మాట్లాడుతూ, దేవీశ్రీప్రసాద్ పాటలు విటుంటే ఆల్రెడీ హిట్ అవుతాయని తెలిసిపోతుందనీ, అల్లు అర్జున్ కు ఆర్య ఎలాంటి హిట్ అయిందో 'ఆర్య-2' అంతకు పదింతలు హిట్ రావాలని కోరుకుంటున్నాననీ అన్నారు. ప్రభాస్ మాట్లాడుతూ, బన్నీ అంటే తనకెంతో ఇష్టమనీ, ఆర్య ఆడియో రిలీజ్ సమయంలో సినిమా పెద్ద హిట్ అవుతుందని తాను చెప్పాననీ, అలాగే జరిగిందనీ అన్నారు. అలాగే దేవీశ్రీ ఈ చిత్రంలోనూ బన్నీకి మంచి ట్యూన్స్ ఇచ్చారనీ, సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాననీ అన్నారు.


No comments:

Post a Comment