'జయీభవ' సంతృప్తినిచ్చింది..

నటుడిగా, నిర్మాతగా ఒక్కో మెట్టు ఎక్కుతున్న నందమూరి హీరో కల్యాణ్ రామ్ తాజాగా 'జయీభవ' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తన అభిరుచికి అనుగుణంగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ అనే సొంత బ్యానర్ స్థాపించి 'అతనొక్కడే', 'హరేరామ్' వంటి హిట్ చిత్రాలను అందించారు. తృతీయ ప్రయత్నంగా 'జయీభవ' చిత్రాన్ని ఆయన నటిస్తూ నిర్మించారు. ఈనెల 23న విడుదలైన ఈ చిత్రం హీరోగా, నిర్మాతగా కూడా తనకు మంచి సంతృప్తినిచ్చిందని కల్యాణ్ రామ్ తెలిపారు. సినిమా విడుదలైన అన్ని కేంద్రాల నుంచి మంచి రిపోర్ట్స్ వస్తున్నాయనీ, ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేక్షకుల నుంచి చక్కటి ఆదరణ లభిస్తోందనీ తెలిపారు. ఆయనతో జరిపిన సంభాషణ ఇలా సాగింది.

? 'జయీభవ'కు రెస్పాన్స్ ఎలా ఉంది
- ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుంచాం. నా గత చిత్రాల మాదిరిగా కాకుండా ఇందులో అవసరమైన మేరకే యాక్షన్ ఉంటుంది. రాష్ట్రంలోనే కాకుండా ఓవర్ సీస్ లో కూడా సినిమా విడుదలైంది. అన్ని చోట్ల నుంచి చక్కటి ప్రేక్షకాదరణ లభిస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి చాలా మంచి స్పందన వస్తోంది. ఫీల్ గుడ్ మూవీ చేశానంటూ అందరూ అభినందిస్తున్నారు.

? 'జయీభవ' ఏ రేంజ్ హిట్
- మా బ్యానర్ నుంచిన వచ్చిన మొదటి రెండు చిత్రాలు హిట్. వాటికంటే వైవిధ్యంగా ఈ సినిమా చేయాలనుకున్నాం. 'అతనొక్కడే' యాక్షన్ ఫిల్మ్. 'హరేరామ్' మరో తరహా యాక్షన్ లో సాగుతుంది. డ్యూయెల్ రోల్ పోషించాను. ఈసారి వినోదాత్మకమైన ఫ్యామిలీ స్టోరీని ఎంచుకుని 'జయీభవ' చేశాం. ఓపెన్సింగ్ బాగున్నాయి. కలెక్షన్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇలాంటి చిత్రాలు ఇన్ స్టంట్ కిక్ ఇవ్వవు. గ్రాడ్యువల్ గా ప్రేక్షకులకు చేరుతాయి. ఓ ఉద్దేశంతో సినిమా తీశామో దానికి దగ్గరయ్యాం. మంచి రేంజ్ అవుతుంది. యూనిట్ అంతా చాలా హ్యాపీగా ఉంది.

No comments:

Post a Comment