కాలేజీలో కృష్ణుడు

శివాజీ, అర్చన జంటగా బాబూ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై చేగొంటి హరిబాబు నిర్మిస్తున్న లవ్ ఎంటర్ టైనర్ 'ఏమైంది నాలో'. రచయిత రాజేంద్రకుమార్ దర్శకుడుగా మారి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో శ్రీకృష్ణుడు రాజేంద్రప్రసాద్ కనిపించనున్నారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.

కాలేజీ నేపథ్యంలో జరిగే ఒక యూత్ ఫుల్ లవ్ స్టోరీ ఇదనీ, ఇందులో శ్రీకృష్ణుడు ఎందుకు వచ్చాడు, వచ్చి ఏం చేశాడనేది ఆసక్తికరంగా ఉంటుందనీ రాజేంద్రకుమార్ తెలిపారు. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్ లపై తీసిన కామెడీ ట్రాక్ నవ్వుల వినోదం పంచుతుందని అన్నారు. ప్రేమకథల్లో ఓ కొత్త కోణం చూపే చిత్రమిదనీ, అన్ని వర్గాల ఆడియెన్స్ తో పాటు యూత్ ను బాగా ఆకట్టుకుంటుందనీ నిర్మాతలు తెలిపారు. నవంబర్ లో మయూరి సంస్థ ద్వారా సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఈ చిత్రానికి జయరామ్ సినిమాటోగ్రఫీ, ఘంటాడి కృష్ణ సంగీతం అందించారు.


No comments:

Post a Comment