తేజం' చిత్రానికి క్లీన్ యు

తొమ్మిది మంది హీరోలను పరిచయం చేస్తూ సన్ రేస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రాజశేఖర్ నిర్మిస్తున్న చిత్రం 'తేజం'. రాజ్ కె.ఎస్.గోపి దర్శకుడు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని క్లీన్ 'యు' సర్టిఫికెట్ పొందింనట్టు దర్శకనిర్మాతలు తెలిపారు.

నేటి యువత మనోభావాలకూ, ప్రస్తుత వస్తవ పరిస్థితులకు దగ్గరగా ఈ చిత్రం ఉంటుందనీ, తొమ్మిది మంది హీరోలను పరిచయం చేస్తున్నామనీ దర్శకుడు రాజ్.కె.ఎస్.గోపి తెలిపారు. బ్రహ్మానందం కామెడీ, ప్రీతి జింగానియా స్పెషల్ సాంగ్ సినిమాకి హైలైట్స్ అవుతాయని అన్నారు. ఎక్కడా రాజీపడకుండా మంచి టెక్నికల్ వాల్యూస్ తో సినిమా తెరకెక్కిందని చెప్పారు. ఈ చిత్రం ఆడియోకి మంచి స్పందన వస్తున్నట్టు నిర్మాత రాజశేఖర్ తెలిపారు. సెన్సార్ సభ్యుల నుంచి కూడా మంచి ప్రశంసలు వచ్చాయన్నారు. నవంబర్ రెండో వారంలో సినిమా రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలో సర్దార్ పటేల్, సురేష్, మహేష్, వినోద్, వివేక్, దిలీప్, గౌతమ్, జయవర్దన్, ప్రీతి జింగానియా, మోనీషా, దివ్వ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ తదితరులు తారాగణం. గణ సంగీతం అందించారు.

No comments:

Post a Comment