బిందు 'కొంచెం కొత్తగా'

పదహారణాల తెలుగమ్మాయి బిందు మాధవి వరుస ఆఫర్లతో క్రమంగా బిజీ అవుతోంది. శేఖర్ కమ్ముల నిర్మించిన 'ఆవకాయ్ బిర్యానీ'చిత్రంలో సాంప్రదాయ భావాలున్న అమ్మాయిగా బిందు నటించి మెప్పించింది. ఆ చిత్రం బాక్సాఫీస్ ను ఆకట్టుకోకున్నా ఇటీవలే విడుదలైన 'బంపర్ ఆఫర్' చిత్రం ఆమెకు కొత్తగా గ్లామర్ గాళ్ ఇమేజ్ ను తెచ్చింది. ఈ చిత్రం ఫరవాలేదనే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా బిందు మాధవి హీరోయిన్ గా ఓ కొత్త చిత్రానికి ప్లానింగ్ జరుగుతోంది. ప్రకాష్ వి ప్రొడక్షన్స్ పతాకంపై వి.నాగేందర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రం ఉంటుందనీ, ఇందులో అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన ఎన్ఆర్ఐ అమ్మాయిగా బిందు మాధవి నటించనుందని తెలుస్తోంది. దీనికి 'కొంచెం కొత్తగా' అనే టైటిల్ ను అనుకుంటున్నారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. దీనితో పాటు రామ్ కథానాయకుడుగా దిల్ రాజు నిర్మించనున్న 'రామ రామ కృష్ణ కృష్ణ' చిత్రంలోనూ బిందు మాధవి ఒక హీరోయిన్ గా ఎంపికైంది. త్రీ ఏంజెల్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ కుమార్తె శేషు ప్రియాంక చలసాని నిర్మిస్తున్న 'ఓం శాంతి'చిత్రంలోనూ నిఖిల్ కు జోడిగా బిందుమాధవి నటిస్తోంది. మరో జంటగా నవదీప్, కాజల్ నటిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణం ప్రోగ్రస్ లో ఉంది. మరిన్ని కొత్త ఆఫర్లు కూడా ఇప్పుడు బిందు మాధవి పరిశీలనలో ఉన్నాయి

No comments:

Post a Comment