జెనీలియా 'కథ' నవంబర్ 18

'బొమ్మరిల్లు' చిత్రంలో హాసినిగా యువ ప్రేక్షకులకు గాలం వేసిన జెనీలియా ఇటీవల 'శశిరేఖా పరిణయం'తో మరోసారి ఆకట్టుకుంది. తాజాగా హీరోయిన్ ఓరియెంటెడ్ ఇతివృత్తంతో ఆమె నటిస్తున్న చిత్రం 'కథ'. అరుణ్ హీరోగా పరిచయమవుతున్నారు. జస్ట్ ఎల్లో సినిమా పతాకంపై గుణ్ణం గంగరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా శ్రీనివాస రాగ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇటీవలే వేల్ రికార్డ్స్ ద్వారా విడుదలైన ఆడియోకి మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలో నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసి నవంబర్ 18న సినిమా విడుదలకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రేమ కథాంశంతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని శ్రీనివాస రాగ తెరకెక్కించారనీ, తమ సంస్థ నుంచి వచ్చిన గత చిత్రాల తరహాలోనే వైవిధ్యమైన ఇతివృత్తంతో ఈ చిత్రం తెరకెక్కిందనీ గుణ్ణం గంగరాజు తెలిపారు. టీచర్ పాత్రలో జెనీలియా కీలక భూమిక పోషించిందని చెప్పారు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ చిత్రం వినూత్న అనుభూతిని కలిగిస్తుందని అన్నారు. ప్రకాష్ రాజ్, రఘుబాబు, షఫీ తదితరులు ఈ చిత్రంలో నటించారు. శ్రీనివాస్ రాగ కథ-స్క్రీన్ ప్లే సైతం అందిస్తున్న ఈ చిత్రానికి గుణ్ణం గంగరాజు మాటలు, రవీందర్ ఆర్ట్, ఆండ్రూ సినిమోటోగ్రఫీ, ఎస్.కె.బాలచంద్రన్ సంగీతం అందించారు

No comments:

Post a Comment