థ్రిల్లర్ 'ఆపార్ట్ మెంట్'

'ఆరుగురు పతివ్రతలు' ఫేమ్ రవివర్మ ప్రధాన పాత్రలో ఎంటర్ టైన్ మెంట్ తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న చిత్రం 'అపార్ట్ మెంట్'. శ్రీ క్రియేటివ్ ఫిలిమ్స్ పతాకంపై ఎ.కె.శ్రీకాంత్, సతీష్ కె.వి.వేగేష్న సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజు.వి దర్శకుడు. రామానాయుడు స్టూడియోస్ లో షూటింగ్ ప్రారభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి ఎ.కె.శ్రీకాంత్ క్లాప్ ఇవ్వగా, సతీష్ వేగేష్న కెమెరా స్విచ్చాన్ చేశారు.

చిత్ర విశేషాలను నిర్మాత శ్రీకాంత్ తెలియజేస్తూ, అపార్ట్ మెంట్ లో జరిగే వివిధ సంఘటనల సమాహారంగా ఈ చిత్రం ఉంటుందనీ, ఎంటర్ టైన్ మెంట్ తో పాటు థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉంటాయనీ చెప్పారు. ఓ ప్రముఖ హీరోయిన్ ఇందులో నటిస్తుందనీ, త్వరలోనే ఆ పేరు ప్రకటిస్తామని సతీష్ వేగేష్న తెలిపారు. సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేసి జనవరిలో రిలీజ్ చేస్తామన్నారు. దర్శకుడు రాజు వి మాట్లాడుతూ, తమిళ, తెలుగు భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ 70 శాతం హైద్రాబాద్ లో నూ, మిగతా భాగం చెన్నైలోనూ చేస్తామని అన్నారు. 'ఏప్రిల్ 1 విడుదల' తరహాలో ఈ చిత్రం ఉంటుందన్నారు. ఇందులోని నాలుగు పాటలకు ఖుద్దూస్ సంగీతం అందిస్తారని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సుజాతా రెడ్డి, అల్లరి సుభాషిణి, రక్ష, మల్లేష్, తడివేలు, రమ్య, సుబ్బరాజు, ఉత్జేజ్, పృధ్వీ తదితరులు నటించనున్నారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం రాజు వి. అందిస్తున్న ఈ చిత్రానికి సాబుజెమ్స్ సినిమాటోగ్రఫీ, నాగిరెడ్డి ఎడిటింగ్ అందిస్తారు.

No comments:

Post a Comment