పూరీ డైరెక్షన్ లో శ్రీకాంత్

'మహాత్మ'తో విజయవంతంగా 100 సినిమాలు పూర్తి చేసిన హీరో శ్రీకాంత్ ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. 'మహాత్మ' చిత్రాన్ని గోల్డెన్ లయన్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించిన శ్రీకాంత్ స్నేహితుడు సి.ఆర్.మనోహర్ మరోసారి శ్రీకాంత్ తో ఓ కొత్త చిత్రాన్ని నిర్మించనున్నారు. దీనికి సంచలన దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది.ఫ్యామిలీ కథాంశంతో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉండబోతోందనీ, ఇందుకోసం శ్రీకాంత్ తన బరువు తగ్గించుకుని స్లిమ్ కాబోతున్నారనీ చెబుతున్నారు. ఇందుకు తగ్గట్టే ఈ చిత్రానికి 'మిస్టర్ అండ్ మిసెస్ శ్రీకాంత్' అనే పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. శ్రీకాంత్ సరసన చార్మింగ్ అందాల చార్మి నటించనుందట. ఇటీవల ఈ ఇద్దరూ కలిసి 'కౌసల్య సుప్రజ రామ' చిత్రంలో నటించారు. 'మహాత్మ' చిత్రంలోనూ ఛార్మి ఓ ఐటెం సాంగ్ లో నర్తించింది. ఈ సందర్భంలోనే ఛార్మితో ఓ సినిమా చేయాలని మనోహర్ అనుకున్నారని, ఇప్పుడు ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేశారనీ చెబుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్న వివరాలు తెలియాల్సి ఉంది. దీనికితోడు లాఫింగ్ లార్ట్స్ పతాకంపై మరో చిత్రానికి కూడా శ్రీకాంత్ కమిట్ అయ్యారు. బాలాజీ ఎన్.సాయి దర్శకత్వంలో మురళీకృష్ణ నిర్మించనున్న ఈ కొత్తచిత్రం ఈనెల 9న ప్రారంభం కానుంది. పూరీ జగన్నాథ్ సైతం ప్రస్తుతం గోపీచంద్ తో 'గోలీమార్' చిత్రానికి పనిచేస్తుండటంతో పూరీ జగన్నాథ్, శ్రీకాంత్ కాంబినేషన్ చిత్రం మరికొంత వ్యవధి తర్వాత ప్రారంభమవుతుంది.

No comments:

Post a Comment